ముంబై, జూలై 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ సేవల పరిశ్రమ పటిష్టమైన రికవరీ సాధిస్తుందని, ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొన్నది. అవుట్సోర్సింగ్ పెరగడం, పలు రంగాలకు ఐటీ పరిశ్రమ అందించే డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులు ఊపందుకోవడంతో ఈ వృద్ధి సాధ్యమని వివరించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్కేర్, రిటైల్, తయారీ రంగాల నుంచి డిజిటలైజేషన్కు డిమాండ్ ఏర్పడినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఐటీ ఆదాయం 2.7 శాతం వృద్ధితో 99 బిలియన్ డాలర్లకు చేరినట్లు నాస్కామ్ చెప్పినది తెలిసిందే.
కరోనా నేపఐటీ రయ్.. రయ్థ్యంలో అవకాశాలు&కరోనా సంక్షోభం నేపథ్యంలో డిజిటలైజేషన్ సర్వీసుల వ్యాపారంలో ఐటీ సర్వీసుల పరిశ్రమకు అదనపు అవకాశాలొచ్చాయని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి చెప్పారు. కరోనాతో రిమోట్ వర్కింగ్, ఈ-కామర్స్, ఆటోమేటెడ్ సర్వీసులు పెరిగాయని, దాంతో డిజిటలైజేషన్ వేగం పుంజుకుందని ఆయన వివరించారు. అలాగే అంతర్జాతీయంగా ఐటీ సర్వీసుల అవుట్సోర్సింగ్ పెరుగుతున్నదన్నారు.
భారత ఐటీ పరిశ్రమ ఆదాయం వృద్ధి పస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల్లో ఉంటుందన్న విశ్వాసాన్ని విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ వ్యక్తం చేశారు. బొంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మట్లాడుతూ కొవిడ్ వైరస్ వ్యాప్తితో లాక్డౌన్లలో చిక్కుకున్న ప్రపంచాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ నడిపించిందని, మార్పుల్ని త్వరితంగా అలవర్చుకుందన్నారు. భారత్ తదుపరి వృద్ధి దశను నడిపించడానికి ఐటీ పరిశ్రమ సంసిద్ధంగా ఉందన్నారు.