సీబీఎస్ఈ-2021 పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)-2021 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. జూలై 15న పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మీడియాకు వెల్లడించారు. విద్యార్థులు ఏయే పరీక్షలను ఏయే తేదీల్లో నిర్వహిస్తారనే వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని ఆయన సూచించారు.
డిసెంబర్ 31న సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ను వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ గత వారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ నెల 22న నిర్వహించిన వెబినార్లో సీబీఎస్ఈ-2021 పరీక్షలు ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే అవకాశం లేదని కొంత క్లారిటీ ఇచ్చారు. తాజాగా మే 4 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే
- రణ్బీర్ కపూర్కు కరోనా పాజిటివ్
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!
- బెంగాల్ పోలింగ్పై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!
- శ్రీవారి సేవలో ఏ1 ఎక్స్ప్రెస్ టీమ్
- నేను హర్ట్ అయ్యా.. రాహుల్కు జ్ఞాపకశక్తి తగ్గిందా ?
- కరోనా టీకా తీసుకున్న పరేష్ రావల్
- భార్యకు టీఎంసీ టికెట్.. హౌరా ఎస్పీని తొలగించిన ఈసీఐ
- 'అలాంటి సిత్రాలు' టీజర్ విడుదల