న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వెబ్సైట్ను సరిచేయాలని, దాన్ని డెవలప్ చేసిన ఇన్ఫోసిస్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. పన్నుదారులను ఇబ్బందిపెట్టవద్దు అని, వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలని ఆమె ఇన్ఫోసిస్ చీఫ్ నందన్ నిలేఖనికి తన ట్వీట్ను ఆమె ట్యాగ్ చేశారు. ఈ-ఫైలింగ్ పోర్లట్ 2.0ను గత రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభించారని, తన ట్విట్టర్ అకౌంట్లో ట్యాక్స్ పేయర్స్ నుంచి ఫిర్యాదులు అందాయని, ఆ టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి తెలిపారు. పన్నుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మల సూచించారు. కొన్ని చోట్ల సైట్ క్రాష్ అయ్యిందని, ఓపెన్ కావడం లేదని ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయి. పన్నుదారుల సౌలభ్యం కోసం కొత్త తరహా ఫీచర్లతో ఐటీశాఖ వెబ్సైట్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.