చండీగఢ్: కరోనా వైరస్ బారినపడిన లెజండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో కొవిడ్-19 చికిత్స పొందుతున్న 91 ఏండ్ల మిల్కా సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, క్రమంగా మెరుగుపడుతోందని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రి తెలిపింది. మునుపటి రోజులతో పోలిస్తే ఆదివారం మిల్కా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ల బృందం తెలిపింది. కరోనా సోకిన తర్వాత మిల్కా ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 3న పీజీఐఎంఈఆర్ హాస్పిటల్ ఐసీయూలో చేరారు.