న్యూఢిల్లీ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సైటింస్ట్ బీ పోస్టుల భర్తీకిని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంకైనవారు ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 28
ఇందులో సివిల్ ఇంజినీరింగ్ 13, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 2, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ 2, కెమిస్ట్రీ 7, టెక్స్టైల్ ఇంజినీరింగ్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కెమిస్ట్రీ పోస్టుకు నేచురల్ సైన్సెస్లో పీజీ, మిగిలిన పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25
వెబ్సైట్: https://bis.gov.in/