న్యూఢిల్లీ: నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 5 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 268 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు అసోం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని బీహెచ్ఈఎల్ పరిశ్రమల్లో ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 268
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. 2021, మే 5 నాటికి 32 ఏండ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 5
వెబ్సైట్: https://www.bel-india.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..