సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లంతా టీఆర్ఎస్ను ఆశీర్వదించి, ఆ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు. అభివృద్ధి, సంక్షేమం కళ్ల ముందు ఉండడంతో మరోమారు ఆ పార్టీ అభ్యర్థులకే సిద్దిపేట ఓటర్లు జైకొట్టారు. మొత్తం 43 వార్డులకు గానూ, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. ఒక వార్డులో బీజేపీ గెలవగా, మిగతా ఐదు వార్డుల్లో ఇతరులు గెలుపొందారు.
ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోల్ కాగా, గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 4 శాతం తగ్గింది ఓటింగ్. అక్కడ మొత్తం ఓట్లు 1,00, 678 గానూ, 67,339 ఓట్లు పోలయ్యాయి. సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది.
జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే.
-1వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి 309 ఓట్ల మెజారిటీతో గెలుపు
-2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీతో గెలుపు
-3వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి 721 ఓట్ల మెజారిటీతో గెలుపు
-4 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత 612 ఓట్ల మెజారిటీతో గెలుపు
-5 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ 570 ఓట్ల మెజారిటీతో గెలుపు
-6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయికుమార్ 420 ఓట్ల మెజార్టీతో గెలుపు
-7వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవీ 573 ఓట్ల మెజారిటీతో గెలుపు
-8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత 411 ఓట్ల మెజార్టీతో గెలుపు
-9వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజార్టీతో గెలుపు
-10వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజార్టీతో గెలుపు
-11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపు
-12వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా శ్రీనివాస్ యాదవ్ 152 ఓట్ల మెజార్టీతో గెలుపు
-13వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి విఠోభ గెలుపు
-14వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట కవిత గెలుపు
-15వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పాతూరి సులోచన గెలుపు
-16వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బర్ల మల్లికార్జున్ గెలుపు
-18వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అడ్డగట్ల కావేరి రేణుక గెలుపు
-19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి రవీందర్ గెలుపు
-21వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఖాజా తబస్సుమ్ అక్తర్ గెలుపు
-22 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల అరవింద్ రెడ్డి 179 ఓట్ల మెజారిటీతో గెలుపు
-23వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయకం లక్ష్మణ్ గెలుపు
-24వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల రాజనర్సు 719 ఓట్ల మెజార్టీతో గెలుపు
-25వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గుండ్ల యోగి గెలుపు
-26వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కెమ్మసారం ప్రవీణ్ గెలుపు
-27వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సద్ది నాగరాజు గెలుపు
-28వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కలకుంట్ల మల్లికార్జున్ గెలుపు
-30వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ ఫాతిమా బేగం వజీర్ గెలుపు
-31వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి జంగిటి కనకరాజు 278 ఓట్ల మెజారిటీతో గెలుపు
-32వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బంధారం శ్రీలత రాజు గెలుపు
-33వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ తస్లీమా బేగం మోహిజ్ 617 ఓట్ల మెజార్టీతో గెలుపు
-34వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్ 1023 ఓట్ల మెజార్టీతో గెలుపు
-37వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సాకీ బాలలక్ష్మి గెలుపు
-38వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ధర్మవరం బ్రహ్మము 627 ఓట్ల మెజారిటీతో గెలుపు
-39వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దీప్తి నాగరాజు 900 ఓట్ల మెజార్టీతో గెలుపు
-40వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్ గెలుపు
-41వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్నగారి సుందర్ గెలుపు