బెంగళూరు: రక్షణ శాఖ పరిధిలోని ఏఎస్సీ సెంటర్ సౌత్ (బెంగళూరు)-2 ఏటీసీ ఖాళీగా ఉన్న గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్ కుక్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 100
ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్ 42, క్లీనర్ 40, కుక్ 15, సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణ తప్పనిసరి. అదేవిధంగా డ్రైవర్ పోస్టుకు ఎల్ఎంవీ, హెచ్ఎంవీ లైసెన్స్, క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు క్యాటరింగ్లో డిప్లొమా ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: The Presiding Officer, Civilian Direct Recruitment Board, CHQ, ASC Centre (South)- 2 ATC, Agram Post, Bangalore-560007
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 12
వెబ్సైట్: https://www.indianarmy.nic.in/