టోక్యో ఒలింపిక్స్లో భారత షూటర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. చరిత్రలోనే అత్యధికంగా ఈసారి 15 మంది భారత్ నుంచి విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్నారు. దీంతో మిగిలిన క్రీడాంశాల కంటే షూటింగ్లో ఈసారి అధిక పతకాలు వస్తాయనే ఆశలు చిగురించాయి. అంతర్జాతీయ టోర్నీలో మన షూటర్లు ప్రదర్శన అంత అద్భుతంగా సాగింది. ముఖ్యంగా ప్రపంచకప్ టోర్నీల్లో స్వర్ణాలతో అదరగొట్టిన మను బాకర్, ఎలావెనిల్ వలరివన్, అపూర్వి చండీలాతో పాటు సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, దివ్యాంశ్ సింగ్ పన్వర్లపై విశ్వక్రీడల పతక ఆకాంక్షలు అధికంగా ఉన్నాయి. మిగిలిన షూటర్లు సైతం ఇటీవలి టోర్నీల్లో మంచి ఫామ్ కనబరిచారు. కరోనా కారణంగా శిక్షణతో పాటు టోర్నీలకు ఆటంకం కలిగినా సత్తాచాటుతామనే ధీమాతో షూటర్లు ఉన్నారు.
మన షూటర్లు: మను బాకర్, ఎలావెనిల్ వలరివాన్, అపూర్వి చండీలా, అంజుమ్ మోద్గిల్, యశస్విని సింగ్ దేశ్వాల్, తేజస్వి సావంత్, రాహి సర్ణోబత్, సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, దివ్యాంశ్ సింగ్, దీపక్ కుమార్, సంజీవ్ రాజ్పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అంగద్వీర్ సింగ్ భాజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్.