న్యూఢిల్లీ: దేశంలోని అగ్రగామి బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫైర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. గతంలో అప్లయ్ చేసుకున్నవారు మరోమారు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 16
అర్హతలు: నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ నుంచి బీఈ (ఫైర్) లేదా బీటెక్, బీఈలో సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్, బీఎస్సీ ఫైర్ కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 15
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: sbi.co.in