లింగంపేట/బాన్సువాడ రూరల్/నాగిరెడ్డిపేట్/సదాశివనగర్ రూరల్/నిజాంసాగర్/తాడ్వాయి, మే 7 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వాటర్డేను శుక్రవారం నిర్వహించారు. లింగంపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి మొక్కలకు నీరు పట్టారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు మొక్కలకు నీరు పోశారు.
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో సర్పంచ్ నారాయణరెడ్డి మొక్కలకు నీరు పోశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్రెడ్డి, గజ్జెల రమేశ్ ఉన్నారు.
నాగిరెడ్డిపేట్, బంజారా తండా, మెల్లకుంట తండాలో ఎంపీవో శ్రీనివాస్ మొక్కలకు నీరు పోశారు. ఆయన వెంట సర్పంచ్ కిచ్చయ్యగారి సునీతారెడ్డి, ఈసీ మధు, బిల్కలెక్టర్ వెంకయ్య ఉన్నారు.
సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామంలో పంచాయ తీ కార్యదర్శి దేవీసింగ్ మొక్కలకు నీరు పట్టారు. ఆయన వెంట ఉపసర్పంచ్ కాట్మాండ్ శివపటేల్, రాజు, రాజయ్య పాల్గొన్నారు.
తాడ్వాయి మండలపరిధిలోని గ్రామాల్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ట్యాంక్ ద్వారా మొక్కలకు నీరు పట్టారు.జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామశివారులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు ఎంపీడీవో రవీశ్వర్గౌడ్ నీరు పట్టారు. ఆయన వెంట సర్పంచ్ రవి పటేల్ తదితరులు ఉన్నారు.