న్యూఢిల్లీ: వైద్య విద్యలో ఎండీ, ఎమ్మెస్, డీఎం, ఎంసీహెచ్, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ సెట్ జూలై సెషన్ పరీక్ష తేదీని ఎయిమ్స్ ప్రకటించింది. ఈ జాతీయ స్థాయి పరీక్షను జూలై 22న నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 16న నిర్వహించాల్సి ఉన్నది. అయితే దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో పరీక్షను వాయిదావేశారు. అయితే పరీక్షను వచ్చే నెలలో నిర్వహించనున్నడంటో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను మార్చుకోవడానికి అవకాశం కల్పించనుంది. జూన్ 20 నుంచి 24 వరకు పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చని పేర్కొంది. ఈ ప్రవేశ పరీక్షను ఎయిమ్స్ నిర్వహిస్తున్నది. అడ్మిట్ కార్డులను జూలై 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
వెబ్సైట్: aiimsexams.ac.in