ముంబై: మహారాష్ట్రలో పోలీసులు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. గడ్చిరోలి జిల్లాలోని దానోరా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై మవోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
గత నెల 28న కూడా గడ్చిరోలి జిల్లాలో జోరుగట్ల అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి