ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డీక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్
మొత్తం పోస్టులు: 51
అర్హతలు: బీఈ, బీటెక్, ఎంసీఏలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణ సాధించాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 3
వెబ్సైట్: cdac.in