న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 280 పోస్టులను భర్తీచేస్తున్నది. అయితే గేట్ స్కోర్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జూన్ 10 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తంఖాళీలు: 280
ఇందులో మెకానికల్ 126, ఎలక్ట్రికల్ 98, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ 56 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఇంజినీరింగ్లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి, అదేవిధంగా గేట్లో అర్హత సాధించాలి. అభ్యర్థులు 27 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
వెబ్సైట్: ntpccareers.net