యాదగిరిగుట్ట రూరల్, జూలై12: గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరియాలని ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టి మొక్కలను నాటి సంరక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. జిల్లాలో సోమవారం పలు చోట్ల పర్యటనకు హాజరైన మంత్రి యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరిసేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ మొక్కలు నాటి అవి పెరిగే వరకు సంరక్షించాలని కోరారు.
ఈ సందర్భంగా మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య గ్రామంలోని పలు అభివృద్ధ్ది పనులకు నిధులను మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. గ్రామం నుంచి గౌరాయపల్లికి వెళ్లే దారిలో వాగు వద్ద రోడ్ డ్యాం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని, గ్రామంలో ని హనుమాన్ ఆలయం నుంచి పాఠశాల వద్దకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజురు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పం దించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ వెంకటయ్య తెలిపారు. దీంతోపా టు గ్రామంలోని చెరువును మినీట్యాంక్బండ్గా మార్చేందుకు నిధులు మంజూరు చేయడానికి మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మల్లాపురంలోని శివాలయంలో ధూపదీప నైవేద్యం కోసం అర్చకుడిని నియమించాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి సర్పంచ్ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాధవులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.