రామన్నపేట, జూలై5: పల్లెలను అభివృద్ధి చేసేందుకే ప్రభు త్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దుబ్బాక గ్రామంలో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, నర్సరీలను వారు పరిశీలించా రు. మండలవ్యాప్తంగా గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేశారు. వీధులను శుభ్రం చేసి, మొక్కలను నాటారు. లక్ష్మాపురం గ్రా మంలో పాఠశాలను శుభ్రం చేశారు. పిచ్చిమొక్కలను తొలగించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ లు గోదాసు శిరీషాపృథ్వీరాజ్, నీల జయలక్ష్మీదయాకర్, అప్పం లక్ష్మీనర్సు, పిట్ట కృష్ణారెడ్డి, మెట్టు మహేందర్రెడ్డి, ఉప్పు ప్రకాశ్, ఎంపీటీసీలు జ్యోతీరామచందర్, నర్సింహ్మ, రేహాన్, దోమల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి
మోత్కూరు, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించనున్నాయని జిల్లా బీసీ సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. సోమవారం మండలంలోని పాలడు గు, పొడిచేడు, అనాజిపురం, దత్తప్పగూడెం, ముశిపట్ల గ్రా మాలను ఆయన సందర్శించి పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించారు. పాలడుగులో పిచ్చి మొక్కల తొలగింపు పనులను పరిశీలించారు. పొడిచేడులో హరితహారం మొక్కలను పం పిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో మనోహర్రెడ్డి, ఎంపీవో సురేందర్రెడ్డి, సర్పంచ్లు పేలపుడి మధు, ఎం యాద య్య, పైళ్ల విజయ పాల్గొన్నారు.
పాఠశాలల శుభ్రం
చౌటుప్పల్ రూరల్, జూలై5: మండలవ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమం సోమవారం ఐదోరోజు ముమ్మరంగా సాగింది. అందు లో భాగంగా మురికికాల్వలు, పాఠశాలలు, వైకుంఠధామాలను శుభ్రం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామాల ప్రజలు కలిసి ఈ కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా శ్రమదానంతో వీధులను శుభ్రం చేశారు. వాటర్ పైపులైన్కు మరమ్మతులు చేశారు.
పిచ్చిమొక్కల తొలగింపు
అడ్డగూడూరు, జూలై5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల పరిసరాల్లో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ఎదుట, పాఠశాలల్లో మొక్కలను నాటాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ రజిత, ఉపసర్పంచ్ రణధీర్రెడ్డి , ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.