భువనగిరి అర్బన్, జూలై 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కా ర్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతున్నదని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపాలిటీల పట్టణ ప్రగతిపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 331.5 టన్నుల చెత్తాచెదారాన్ని ప్రజల భాగస్వామ్యంతో తొలగించినట్లు, అదేవిధంగా శిథిల వ్యర్థాలను 178.85 టన్నుల మేర, 164.86 టన్నుల చెట్ల పొదలను తొలగించామన్నారు. 179 కిలోమీటర్ల మేర మురుగు కాల్వల్లో పూడికతీత తీసి మట్టిని తొలగించి శుభ్రం చేసినట్లు ఆమె చెప్పారు. శిథిలావస్థలో ఉన్న 30 ఇండ్లను తొలగించి 109 లో తట్టు ప్రాంతాలను గుర్తించి మురుగునీరు నిల్వ ఉండకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యల్లో భాగంగా 199 ప్రాంతాల్లో ఫాగింగ్, స్ప్రే చేపట్టామన్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 61 తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి 71 మున్సిపల్ పార్కులు, 127 విద్యాసంస్థల్లో పారిశుధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 51 పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరిచారన్నారు. 13 వైకుంఠధామాలను శుభ్రం చేయ డంతోపాటు 21 పనిచేయని మంచినీటి బోరు, బావులను గుర్తించి పూడ్చివేసినట్లు వివరించారు. ఆరు మున్సిపాలిటీల్లో4.09కిలోమీటర్ల మేర 3,396 మొక్కలను నాటించినట్లు, ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీలో భాగంగా ఇప్పటివరకు 53,726 మొక్కలను పంపిణీ చేశామన్నారు. తుప్పు పట్టి వంగిన విద్యుత్ స్తంభాలను తొలగిం చి వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. జిల్లాలోని 19 వైకుంఠధామాల నిర్మాణాలకు టెండర్లు పిలిచి 8 వైకుంఠధామాలను నూతనంగా ప్రారంభించామని, 28 దళిత బస్తీల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రగతి పనుల పరిశీలన
భూదాన్పోచంపల్లి, జూలై5: భూదాన్పోచంపల్లి పట్టణంలో పట్టణప్రగతి పనులను కలెక్టర్ పమేలాసత్పతి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించా రు. ప్రకృతివనాన్ని సందర్శన అనంతరం ప్రభు త్వ పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం మహమ్మాయికాలనీలో వెజ్ మార్కెట్ను పరిశీలించారు. వైకుంఠధామాన్ని పరిశీలించి నూతన ఎలక్ట్రికల్ ద్వారా దహన సంస్కారాలను కాలుష్య రహితంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్కు సూచించారు. వైకుంఠధామం, వెజ్, నాన్వెజ్ మార్కెట్లను వెంటనే ఏర్పాట్లు చేయాల ని వాటికి అవసరమైన స్థల సేకరణ చేపట్టి కాం ట్రాక్టర్లను పిలిపించి పనులను త్వరగా పూర్తి చేసే లా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీశ్రీనివాస్, కమిషనర్ సుదర్శన్, వైస్ చైర్మన్ లింగస్వామి, కౌన్సిలర్లు మధు, అఖిల, దేవరాయ కుమార్ పాల్గొన్నారు.