ములుగు : మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అత్యంత మారుమూల అటవీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గిరిజన పుత్రుల అభ్యున్నతికి ఈ స్కూళ్లు పునాదులు వేస్తాయన్నారు.
అత్యంతత మారుమూల ప్రాంతంలో స్కూల్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. జోరు వర్షంలోనూ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి బిందు, కలెక్టర్ వి పి గౌతమ్, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు జెండగే, అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్ , గిరిజన శాఖ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
200 కోట్ల డాలర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్ మాజీ భార్య