పల్లెప్రగతితో మారినగ్రామ రూపురేఖలు
వీధుల్లో నిత్యం పారిశుధ్య పనులు
పక్కా ప్రణాళికతో మౌలిక వసతులు
ఇంటింటికీ నల్లా కలెక్షన్తో తీరినతాగునీటి సమస్య
రూ. 20లక్షల40వేలతో అభివృద్ధి పనులు
ఆలేరురూరల్, జూన్ 9: గత పాలకుల హయాంలో చెత్తాచెదారంతో ఉన్న మండలంలోని తూర్పుగూడెం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో ప్రగతివైపు పరుగులు పెడుతున్నది. కరోనా మహ్మరిని కట్టడి చేసింది. పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. వీధుల్లో నిత్యం బ్లీచింగ్ పౌడర్ చల్లడం, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. గ్రామంలో 633 మంది ఓటర్లు ఉన్నారు. 265 కుటుంబాలు ఉన్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం సమావేశమై వెంటనే పరిష్కరిస్తున్నది. గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20లక్షల 40వేలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజల అవసరాల కోసం రూ.9లక్షలతో వైకుంఠధామం, రూ.2లక్షల 50వేలతో డంపింగ్యార్డు నిర్మాణం, రూ.80వేలతో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశారు.
డంపింగ్యార్డు,అండర్డ్రైనేజీ నిర్మాణం
పారిశుధ్య కార్మికులు తడిపొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్యార్డులో ఇప్పటికే ఎర్రలను వేసి చెత్తను కంపోస్ట్ఎరువుగా తయారుచేసి నర్సరీలో మొక్కలకు వేస్తున్నారు. గ్రామంలో సుమారు రూ.5లక్షలతో అండర్డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. మరో రూ.5లక్షలతో సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టారు. గ్రామంలోని 18పాడుబడ్డ ఇండ్లను కూల్చివేశారు.
ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు
గ్రామపంచాయతీకి ప్రభుత్వం కేటాయించిన నిధులతో రూ.9లక్షల15వేలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు. నిరంతరం ట్యాంకర్తో హరితహారం మొక్కలకు నీటిని పడుతున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేస్తూ పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.