హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీతో పాటు తదితర డిమాండ్ల అన్నింటికి పెద్ద మనసుతో ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు మంత్రివర్గానికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 30 శాతం ఫిట్మెంట్తో పాటు ఇతర పీఆర్సీ జీవోల విడుదలకు ఆమోదం తెలిపినందుకు యావత్తు తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఔట్సోర్సింగ్, ఇతరత్రా ఉద్యోగులందరి తరపున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. టీజీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను సన్మానించారు.