అలీగఢ్: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) సిబ్బందిని కరోనా కలవరపెడుతున్నది. గడిచిన 18 రోజుల్లో 34 మంది టీచర్లు, రిటైర్డ్ టీచర్లు వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో అప్రమత్తమైన వైస్ ఛాన్స్లర్ తారిఖ్ మన్సూర్.. ఐసీఎంఆర్కు ఆదివారం లేఖ రాశారు. కరోనాకు సంబంధించిన ప్రత్యేకమైన వేరియెంట్ వ్యాప్తి తమ క్యాంపస్లో ఉన్నదో, లేదో అధ్యయనం చేయాల్సిందిగా ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.