కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే బెంగాల్లో చెలరేగిన హింస తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటనలు తమను చాలా బాధించాయని చెప్పారు.
ఇలాంటి హింసాత్మక ఘటనలు దేశ విభజన సమయంలో మాత్రమే జరిగినట్లు తాను విన్నానని జేపీ నడ్డా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఇలాంటి హింస చెలరేగడం స్వాతంత్య్ర భారతదేశంలో మనం ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కోల్కతాలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.