సిటీబ్యూరో, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): ఒక వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే మరోవైపు అంబులెన్స్ అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ, మధ్యతరగతుల వారు రోగం, ఆర్థిక భారం తో కొట్టుమిట్టాడుతున్న ఘటనలెన్నో కార్పొరేట్ కంపెనీలను కదిలించాయి. మానవతా హృదయంతో ముం దుకు వచ్చిన వారు తమ వంతు సహాయాన్ని అందించే క్రమంలో ప్రజల కోసం 12 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆదర్శ కార్యక్రమానికి వారధిగా ‘సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ పోలీసులు’ చేసిన కృషితో ప్రజలకు ఇప్పుడు ఉచిత అం బులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. మానవతా ధృ క్ఫథంతో ముందుకు వచ్చి తీసుకువచ్చిన ఈ 12 ఉచిత అంబులెన్స్ల సేవలను శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. ఎవరైనా అంబులెన్స్ నిర్వాహకులు సాధారణ ధర కంటే అధికంగా వసూలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ఉచిత అంబులెన్స్ సేవలను కొవిడ్ బారిన పడిన వారు గాని, ఇతర రోగాలతో బాధపడుతున్న వారు వినియోగించుకోవచ్చన్నారు. దీని కోసం సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ రూమ్ నెం. 94906 17440, 94906 17431లలో సంప్రదించవచ్చని చెప్పారు.