న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. హాస్పిటళ్లలో ఆక్సిజన్, ఐసీయూ పడకల కొరతపై కేంద్రాన్ని నిలదీశారు. కరోనాతోనే మరణాలు నమోదవుతున్నాయంటే.. ఆక్సీజన్ కొరతతో మరింత మంది ప్రాణాలు వదులున్నారని ఆరోపించారు. వాటికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ రోగిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుందని, ఆక్సిజన్ సరఫరా, ఐసీయూ పడకల ఏర్పాటులో కేంద్రం విఫలమైందని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో గత 24 గంటల్లో 235 మంది రోగులు మృత్యువాతపడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో దవాఖానలో మరో రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉందని, ఇంకా 60 మది రోగులు ప్రమాదంలో ఉన్నారని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. సకాలంలో ఆక్సిజన్ అందకపోతే వారిని ప్రాణాలతో కాపాడటం కష్టమని పేర్కొన్నారు. మ్యానువల్ వెంటిలేషన్ ద్వారా ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డుల్లో రోగులకు చికిత్స చేస్తున్నట్లు మెడికల్స్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.