నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 19 : జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విస్తరిస్తున్నది. పల్లెల్లో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. వైరస్బారిన పడినవారికి వైద్యసిబ్బంది ఐసొలేషన్ కిట్లు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరి స్తున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ కొనసాగింది.
కోటగిరి మండలంలో 35 మంది కరోనాబారిన పడ్డారని డాక్టర్ సమత, సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు. కోటగిరి దవాఖానలో 93మందికి టెస్టులు నిర్వహించగా 25 మందికి, పొతంగల్ దవాఖానలో 98 మందికి టెస్టులు నిర్వహించగా 10 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. కోటగిరిలో 77 మందికి, పొతంగల్లో 46 మందికి కరోనా వ్యాక్సిన్ చేశామన్నారు. ఇందల్వాయి పీహెచ్సీలో 104 మందికి టెస్టులు నిర్వహించగా 28 మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ శుభాకర్ తెలిపారు. ధర్పల్లి ప్రభుత్వ దవాఖానలో 130 మందికి టెస్టులు నిర్వహించగా 61 మందికి పాజిటివ్గానిర్ధారణ అయ్యిందని డాక్టర్ రఘువీర్ తెలిపారు.
మోస్రా పీహెచ్సీలో 226 మందికి టెస్టులు నిర్వహించామని, 52 మంది వైరస్బారిన పడ్డారని వైద్యాధికారిణి స్వప్న తెలిపారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో 132 మందికి టెస్టులు నిర్వహించగా 37మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం 86 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,12 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు సంజీవ్రెడ్డి తెలిపారు. 93 మందికి కరోనా వ్యా క్సిన్ వేశామన్నారు. రెంజల్ పీహెచ్సీలో సోమవారం 148 మందికి పరీక్షలు నిర్వహించగా, 24 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తాడ్బిలోలి గ్రా మంలో ఇద్దరికి పాజిటివ్ రాగా, గ్రామంలో కేసు ల సంఖ్య 50కి చేరింది. దీంతో గ్రామంలో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్లు సర్పంచ్ సునీత తెలిపారు. మండలంలోని తాడ్బిలోలి, వీరన్నగుట్ట, రెంజల్ గ్రామా ల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది.
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో సోమవారం 264 మందికి కొవిడ్ పరీక్ష లు నిర్వహించగా.. 70 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాకాసీపేట్లోని అర్బన్హెల్త్ సెంటర్లో 151 మందికి పరీక్షలు నిర్వహించగా.. 53 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో వందమందికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 96 మందికి, పాన్గల్లీలోని పీహెచ్సీలో 84 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం 214 మందికి పరీక్షలు నిర్వహించగా.. 52 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మోర్తాడ్లోని సీహెచ్సీలో, కమ్మర్పల్లి, చౌట్పల్లి పీహెచ్సీల్లో కొవిడ్ టెస్ట్లు కొసాగుతున్నాయి.
మోర్తాడ్ సీహెచ్సీలో 112 మందికి టెస్ట్లు నిర్వహించగా 20 మందికి, కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి పీహెచ్సీలో 159 మందికి టెస్ట్లు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు సుమంత్, రతన్సింగ్ తెలిపారు. కమ్మర్పల్లి పీహెచ్సీలో 223 మందికి టెస్టులు నిర్వహించగా 31 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నరసింహస్వామి తెలిపారు. మోర్తాడ్లో 126 మందికి, కమ్మర్పల్లిలో 158 మందికి, చౌట్పల్లిలో 108 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 35 మందికి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో 90 మందికి పరీక్షలు నిర్వహించగా.. 16 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఏరియా దవాఖానలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు రెండో డోస్ కరోనా టీకాను వేసుకున్నారు.
ఇవీ కూడా చదవండి…
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యం