ఘనంగా బీపీ మండల్ వర్ధంతి
కొల్లాపూర్, ఏప్రిల్ 13: బీసీల ఆశాజ్యోతి, ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ 40వ వర్ధంతిని కొల్లాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మండల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేదిక నాయకులు విశ్రాంత ఉపాధ్యాయులు బరిగేల బాలయ్యయాదవ్ మాట్లాడుతూ భారతదేశంలో 70కోట్ల మంది బీసీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుటకు 40 ప్రతిపాదనలు చేసి 1993 నుంచి ఒక్క ప్రతిపాదన మాత్రమే విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్ అమలు చేయడం అభినవ అంబేద్కర్ బీపీ మండల్ అని పేర్కొన్నారు. 1979 నుంచి 1980 వరకు రెండేండ్లుగా అవిశ్రాంతంగా మండల్ కమిషన్ దేశంలోని వివిధ ప్రాంతాలను తిరిగి సంపూర్ణ సమాచారాన్ని సేకరించి బీసీల సమగ్ర వికాసం కోసం 40ప్రతిపాదనలు చేసిందన్నారు. బీసీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖరాచారి మాట్లాడుతూ బీసీల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసిన మండల్ విగ్రహాన్ని కొల్లాపూర్లో ఆవిష్కరణకు తాను సాయం చేస్తానని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, బహుజన జాక్ చైర్మన్ రాముడుయాదవ్, ప్రభుత్వ దవాఖాన అభివృద్ధ్ది సలహాకమిటీ చైర్మన్ జంబులయ్య, సత్యనారాయణయాదవ్, కౌన్సిలర్ రాముడుయాదవ్ తదితరులు మండల్ సేవలను కొనియాడారు.కార్యక్రమంలో శేఖర్యాదవ్, వేణు గోపాల్యాదవ్, భాస్కర్యాదవ్, విష్ణుమూర్తియాదవ్, మాసయ్యయాదవ్, చంద్రయ్యయాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఖాదర్పాషా తదితరులు పాల్గొన్నారు.