సిద్దిపేట: రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కొమురవెల్లి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ అర్చకులు, ఒగ్గు పూజారులతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాల వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేవాదాయశాఖ అనుమతించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..