సత్తుపల్లి రూరల్, కల్లూరు, తల్లాడ, వేంసూరు, వైరా, కారేపల్లి, కామేపల్లి, కొణిజర్ల, ఏప్రిల్ 2 : సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో క్రైస్తవ సోదరులు గుడ్ఫ్రైడే వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. పలు క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సత్తుపల్లి జ్యోతి నిలయం కార్మెల్ మాత దేవాలయంలో ఫాదర్లు బుద్ధ అనిల్కుమార్, క్రీస్తుబాబు మాట్లాడుతూ ఏసుక్రీస్తు మానవత్వం పట్ల గొప్ప ప్రేమను చూపించాడన్నారు. కల్లూరులోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో సందడి నెలకొంది. ఉపవాస దీక్షల్లో పాల్గొన్న క్రైస్తవులకు నేటితో ఉపవాస ప్రార్థనలు ముగిశాయి. తల్లాడ మండలంలో ఘనంగా నిర్వహించారు. పలువురు ఫాస్టర్లు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ క్రీస్తుమార్గాన్ని ఆచరించాలన్నారు. ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో దేవుడి కృపకు పాత్రులు కావాలన్నారు. తల్లాడ, మిట్టపల్లి, కుర్నవల్లి, ముద్దునూరు, పినపాక, అన్నారుగూడెం, పలుగ్రామాల్లో గుడ్ఫ్రైడే వేడుకలు నిర్వహించారు.
వేంసూరు మండలంలోని గ్రామాల్లో వారి ఇళ్లల్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలు అందరూ సుఃఖశాంతులతో వర్ధిల్లాలని వేంసూరు ఏబీనేజర్ సంఘం కాపరి ఆకుల రాజకుమార్ తెలిపారు. వైరాతో పాటు, మండల పరిధిలోని రెబ్బవరం ఆర్సీఎం చర్చీ నందు, కొండకొడిమలోని కలవరికొండ గుట్ట వద్ద భక్తులు యేసుక్రీస్తు సిలువ మార్గంను మోస్తూ ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎం.ప్రసాద్, రమేశ్, వెంకటి, జాకోబు, చల్లా జోజి, ఆంతోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోగల వివిధ చర్చీల ఆధ్వర్యంలో సిలువమార్గం చేపట్టారు. పలువురు మతబోధకులు మాట్లాడుతూ పాపం చేసిన మానవుడు పరలోకాన్ని చేరలేడన్నారు. సంతసమీపంలోని రగులుచున్న అగ్ని, బీసీ కాలనీలోని యేషయా ప్రార్థన మందిరాల్లో గుడ్ప్రైడే వేడుకలు నిర్వహించారు. కామేపల్లి మండల వ్యాప్తంగా గుడ్ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. క్రిస్టియన్ సోదరులు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొణిజర్ల మండలంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ఏసుక్రీస్తు దివ్య సందేశాన్ని క్రైస్తవులకు తెలియజేశారు.