మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలింపు
దగ్గరుండి ధైర్యం చెప్పి తీసుకెళ్లిన ఎంపీ మాలోత్ కవిత
ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడి
కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ
గూడూరు, మార్చి 28 : పురుగుల మం దు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చా వు బతుకులతో పోరాడుతున్న సునీల్కు ప్రభుత్వం అండగా నిలిచింది. మహబూబాబాద్ ఎంపీ కవిత అతడి పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్యం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి ఔదార్యం చాటుకున్నారు. మండలంలోని తేజావత్ రాంసింగ్ తండా గ్రామ పరిధిలోని సోమ్లాతండాకు చెందిన బోడ సునీల్ మనస్తాపంతో ఈనెల 26న పురుగుల మందు తాగాడు. కుంటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతడిని ఎంజీ ఎం దవాఖానకు తరలించారు. రెండు రోజుల నుంచి అతడి పరిస్థితి విషమంగా ఉంది. కా గా, విషయం తెలుసుకున్న ఎంపీ కవిత సునీల్కు హైదరాబాద్లోని నిమ్స్లో మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ సంతోష్కుమార్ కోరగా, ఆయన అందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఎంపీ కవిత వెంటనే వెంటిలేటర్ ఉన్న అంబులెన్స్ను ఏర్పాటు చేసి సునీల్ను నిమ్స్కు తరలించారు. నిమ్స్ ఆర్ఎంవో రమేశ్తో మాట్లాడి సునీల్కు దగ్గరుండి చికిత్స చేయించారు. అనంతరం ఆమె నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. జీవితం చాలా విలువైనదని, యువత బంగారు తెలంగాణలో పాలుపంచుకోవాలని కోరా రు. సునీల్ వైద్యానికయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, అతను కోలుకోగానే కుంటుంబానికి ప్రభు త్వం అండగా నిలబడుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!
తలనొప్పిని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!