వికారాబాద్, మార్చి 27: గ్రామంలో మరింత మెరు గైన అభివృద్ధి సాధించాలని పంచాయతీ అధికారులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచిం చారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి గ్రా మం లోని పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో శానిటేషన్, వైకుంఠధామం, పీపీవీ షెడ్, క్యాటిల్ షెడ్, కూరగాయల పందిళ్లు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. గ్రామంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించాలని పంచాయతీ అధికారులకు సూచించా రు. ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ చాలా బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి అనిత, ఎంపీడీవో సుభాషిణి, ఏపీవో శ్రీనివాస్, ఎంపీవో నాగరాజు, ఎన్ఆర్ఈజీఎస్ ఏఈ నవీన్కుమార్, సర్పంచ్ మల్లమ్మ, ఉపసర్పంచ్ నజిమున్నీసా బేగం, పంచా యతీ కార్యదర్శి మధుకర్రెడ్డి పాల్గొన్నారు.