వేసవి విడిదికి విదేశీ అతిథుల రాక మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నైజీరియా, కొరియా దేశాల నుంచి పక్షులు ఎగిరొస్తున్నాయి. సంగెం మండలం తిమ్మాపూర్ చెరువు వద్ద సైబీరియన్ కొంగలు సేదతీరుతూ చూపరులను కనువిందు చేస్తున్నాయి.