వాడేసిన టైర్లతో రకరకాల డిజైన్లలో చెప్పులు తయారుచేస్తూ సరికొత్త ఆలోచనతో సాగుతున్నది మహారాష్ట్రలోని పుణెకు చెందిన పూజా ఆప్టే. రీ సైక్లింగ్పై ఉన్న మక్కువతో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుంది. కుప్పలు తెప్పలుగా పడుండే పాతటైర్లను సేకరించి చెప్పులు కుట్టేవారి సాయంతో తన ఆలోచనకు రూపాన్నిచ్చిందామె. ‘నేమిటల్’ స్టార్టప్ మొదలుపెట్టింది. ‘నేమి’ అంటే చక్రం (టైర్), టల్ అంటే ఆత్మ (సోల్)’ అంటూ తన రీసైక్లింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించింది పూజ. ‘స్టార్టప్ ఇండియా’ పోటీలో అవార్డు పొందిన ఈ చెప్పుల తయారీలో ముఖ్యంగా ట్రక్కులు, విమానాల టైర్లను వాడతారు. టైలరింగ్ షాపుల్లో మిగిలిపోయే ఫ్యాబ్రిక్ని డిజైనింగ్ కోసం ఉపయోగిస్తున్నా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అన్నిటినీ అధిగమించింది. మార్కెట్లో ఈ ఎకో ఫ్రెండ్లీ చెప్పులు రూ.600 నుండి రూ.1,200 వరకు పలుకుతున్నాయి. పలు డిజైనర్ సంస్థలతో కలిసి నయా ఫ్యాషన్కు తగ్గ స్లిప్పర్స్, సైండిల్స్ను ఉత్పత్తి చేస్తుండటం విశేషం. దేశవ్యాప్తంగా ఈ ఆలోచనను ఆచరణలో పెట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నది పూజ.