ములుగు : అడుగనిదే అమ్మయినా అన్నం పెట్టదంటారు. కానీ, తాను మాత్రం అంతకు మించి మానవతా దృక్పథంతో స్పందించింది. మతిస్థిమితం లేక ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడికి అండగా నిలిచింది. తన లంచ్ బాక్స్ని తినిపించి మానవత్వాన్ని చాటారు ములుగు సబ్ రిజిస్టార్ తస్లీమా. వివరాల్లోకి వెళ్తే..ములుగు మండలంలోని మల్లంపల్లిలో మతిస్థిమితం లేకుండా ఆకలితో ఓ పిచ్చివాడు రోడ్లపై తిరుగుతున్నాడు. ఈ దయనీయ దృశ్యాన్ని గమనించిన సబ్ రిజిస్టార్ తస్లీమా చలించిపోయింది. తన లంచ్ బాక్స్ను మతిస్థిమితం లేని వ్యక్తికి స్వయంగా తినిపించి మానవత్వం చాటుకున్నారు. తస్లీమా మంచి మనసుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.