సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ) : వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న పలువురు వ్యాపారులు.. బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నా రు.. దీనిపై రాచకొండ పోలీసులు నిఘా పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు.. వారి నుంచి రూ.1.16 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్ రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు… రాచకొండ పరిధిలోని హయత్నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు.. బ్రాండె డ్ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం ఆయా గోదాంల్లో తనిఖీలు నిర్వహించి.. ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ.1.16 కోట్ల విలువ చేసే దాదాపు 1000 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీ నం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను పట్టుకున్న సిబ్బందికి సీపీ రివార్డులను అందించారు. సమావేశంలో డీసీపీలు శ్రీనివాస్, సురేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఓటీ అధికారులు పాల్గొన్నారు.
పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్ట్ విధిస్తామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ను నోడల్ అధికారిగా నియమించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం.9490617111కు సమాచారం అందించాలన్నారు. రాచకొండలో ఇప్పటి వరకు 10 మంది నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్ విధించామన్నారు. విచారణలో నేరం రుజువైతే నిందితులకు 7 ఏండ్ల జైలు ఖాయమని సీపీ స్పష్టం చేశారు. ఇటీవల సూర్యాపేటలో నకిలీ విత్తనాలను విక్రయిస్తూ పట్టుబడ్డ ఏరువు శివారెడ్డిని 2017లో అరెస్ట్ చేశామని…అతనిపై పీడీ యాక్ట్ కూడా విధించామని సీపీ తెలిపారు.
గుంటూరుకు చెందిన గారినేని ఫణి గోపాల్ హయత్నగర్, పసుమాముల గ్రామంలో అక్రమంగా గోదాంను నిర్వహిస్తున్నాడు. అందులో ఎండు మిరపకు సంబంధించిన నకిలీ విత్తనాలు, గడువు తీరిన విత్తనాలను బ్రాండెడ్ కంపెనీ ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాడు.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆ గోదాంపై దాడిచేసి.. గోపాల్ను అదుపులోకి తీసుకున్నారు.. దాదాపు రూ.60 లక్షల విలువ చేసే బిబో హైతి, బిబో-9, బిబో చైత్ర కంపెనీ ప్యాకింగ్లతో ఉన్న 3,875 ప్యాకెట్లు…41 కేజీల నాసిరకం విత్తనాలు, 2వేల బ్రాండెడ్ కంపెనీల ఖాళీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ముసారాంబాగ్ ప్రాంతానికి చెందిన గోపాల్ కమల్ కిశోర్ సురేఖ రియల్ ఇండియా అగ్రో టెక్ పేరుతో విత్తనాల విక్రయాల డీలర్గా వ్యాపారం చేస్తున్నాడు. అయి తే.. అక్రమంగా హయత్నగర్ శాంతినగర్ ప్రాంతంలో ఓ గోదాంను నిర్వహిస్తున్నాడు. అందులో వరి, కంది, క్యాస్టర్ నాసిరకం విత్తనాలను బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాడు. అలాగే.. ఇతర రాష్ర్టాల నుంచి గడువు తీరిన విత్తనాలను తీసుకువచ్చి.. ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి.. ఆ గోదాంలో సోదాలు చేసి.. గోపాల్ను అదుపులోకి తీసుకున్నారు. 197- వరి విత్తనాలు, 150 బ్యాగులు, 28 బ్యాగుల కంది విత్తనాలు, 71 బ్యాగుల క్యాస్టర్ సీడ్స్ విత్తనాలు, 400 రియల్ ఇండియా అగ్రో టెక్ బ్యాగులు, మొత్తం రూ.50 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
చింతల్కుంట వెంకటరమణ కాలనీకి చెందిన కాకా ని వెంకటరమణ బాబు శ్రీ కామాక్షి సీడ్స్ పేరుతో వ్యా పారం నిర్వహిస్తున్నాడు. అక్రమంగా పత్తి విత్తనాలను నిల్వ ఉంచి.. అధిక ధరకు అమ్ముతున్నాడు. కర్నాటక రాష్ర్టానికి చెందిన వీరాంజనేయిలు నుంచి నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి నాసిరక పల్లీలను తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు చింతల్కుంటలోని అతని గోదాంపై సోదాలు జరిపారు. 17 బ్యాగుల్లో సురేఖ, శ్రీ సాయి పేర్లతో ఉన్న దాదాపు 527 బీటీ-2 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 10 కేజీల నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలు, 2 క్వింటాళ్ల నాసిరకం పల్లీలను స్వాధీనం చేసుకున్నారు.