కింది వాటిలో భారత దేశం ఉనికి, భౌతిక అమరిక అనే అంశానికి చెందిన సరికాని ప్రకటనను గుర్తించండి? 1) భారత్ హిందూ మహాసముద్రానికి ఉత్తరంగా దక్షిణాసియా ఖండ భూభాగంలో పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉంది 2) అక్షాంశాల దృష్ట్యా ఉత్తరార్ధగోళంలో 80.4|-370.6|ల మధ్య 3,214 కి.మీ. పొడవులో ఉత్తరం, దక్షిణంల మధ్య విస్తరించి ఉంది 3) రేఖాంశాల దృష్ట్యా పూర్వార్ధగోళంలో 680.7|-970.25|ల మధ్య 2,933 కి.మీ. వెడల్పుతో తూర్పు, పడమరల మధ్య విస్తరించి ఉంది 4) 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం అయిన మకర రేఖ దేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ 8 రాష్ర్టాలు, పలు ప్రధాన నదులను ఖండిస్తూ ప్రయాణిస్తుంది
భారత దేశం ఉపఖండం అని పిలవడానికి కింది వాటిలో సరైనవి? ఎ. భౌగోళిక విస్తీర్ణం, విశిష్ట లక్షణాలు, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగి ఉండటం వల్ల దేశాన్ని ఉపఖండం అని పిలుస్తారు బి. ఖండానికి ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఖండ భూభాగంలో అంతర్భాగం అయి ఉన్నందున ఉపఖండంగా పేర్కొంటారు 1) ఎ మాత్రమే సరైనది 2) ఎ సరైనది, బి సరికానిది 3) ఎ, బి సరైనవి 4) బి మాత్రమే సరైనది
కింది వాటిలో భారత ఉపఖండపు దేశాల్లో ఉపయుక్తంగా ఉన్న అంశాలను గుర్తించండి? ఎ. భారత ఉపఖండంలోని 7 దేశాల్లో విస్తీర్ణంలో పెద్ద దేశం భారత్ కాగా, విస్తీర్ణంలో చిన్న దేశం మాల్దీవులు బి. భారత ఉపఖండపు దేశాలన్నీ కలిసి ఒక ప్రాంతీయ, ఆర్థిక సహకార కూటమిగా ఏర్పడింది. అదే సార్క్. ప్రస్తుత సార్క్ సభ్యదేశాల సంఖ్య 8 సి. భారత ఉపఖండపు దేశాల్లో గరిష్ట జనసాంద్రత గల దేశం బంగ్లాదేశ్ డి. సార్క్ దేశాల సెక్రటేరియట్ నేపాల్లోని కఠ్మాండులో ఉంది. 8వ సభ్యదేశంగా అప్గానిస్థాన్ చేరింది (2007, ఏప్రిల్ 8) 1) ఎ, బి, డి 2) ఎ, బి 3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
భారత దేశం నామధేయం ప్రాధాన్యతా ఆధారంగా కింది వాటిని జతపర్చండి? ఎ. విష్ణుపురాణం 1. ఇండియా (ఇండస్) బి. మనుస్మృతి 2. బిమాంజూ సి. గ్రీకులు 3. ఆర్యావర్తనం డి. చైనావారు 4. జంబూ ద్వీపం ఇ. బౌద్ధ సాహిత్యం 5. భారతి 1) ఎ-1, బి-3, సి-2, డి-5, ఇ-4 2) ఎ-5, బి-3, సి-1, డి-2, ఇ-4 3) ఎ-5, బి-3, సి-4, డి-2, ఇ-1 4) ఎ-1, బి-3, సి-5, డి-2, ఇ-4
కింది వాటిలో భారత దేశాన్ని గొప్పగా ఏమని పేర్కొంటారు? 1) చైనా, జపాన్ వారు భారత్ను ‘ప్రపంచ స్వర్ణ కేంద్రం’ అని పేర్కొన్నారు 2) తూర్పు సముద్రాల శ్రీమతిగా కీర్తించబడుతుంది 3) పేద ప్రజలు నివసించే గొప్ప దేశం 4) పైవన్నీ
కింది వాటిలో సరికాని అంశాన్నిగుర్తించండి? 1) భారత్కు అత్యంత ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతం జమ్ముకశ్మీర్లోని ఇందిరా కాల్/ కిలిక్ ధావన్ పాస్ 2) భారత్కు పశ్చిమాన చివరి ప్రాంతం గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని గుహర్ మోతి 3) దేశానికి అత్యంత ఉత్తర దిక్కున ఉన్న రాష్ట్రం జమ్ముకశ్మీర్ 4) భారత్లో అరుణాచల్ ప్రదేశ్లోని ‘దాంగ్ కనుమ’ వద్ద మొదటగా సూర్యుడు ఉదయించిన 2 గంటల అనంతరం పశ్చిమాన గుజరాత్లోని ‘ద్వారక’ వద్ద ఉదయిస్తాడు
కింది వాటిలో సరైనవి? ఎ. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల మధ్య 300 రేఖాంశాలు ఉన్నాయి బి. పొరుగు దేశాలతో సరిహద్దుగల రాష్ర్టాలు 16 ఉన్నాయి సి. భారత్తో అధిక సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్, అల్ప సరిహద్దు గల దేశం అఫ్గానిస్థాన్ డి. భారత్తో సరిహద్దు గల దేశాలు 7 1) ఎ, సి, డి 2) బి, సి 3) ఎ, బి, సి, డి 4) ఎ, సి
దేశంలో కర్కటక రేఖ ప్రధానంగా ప్రయాణిస్తున్న నగరాల్లో సరికానిది? 1) రాంచీ 2) ఐజ్వాల్ 3) జబల్పూర్ 4) బైకుంఠపూర్
కర్కటక రేఖ (23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం)కు దిగువన గల నగరాలు? 1) రాంచీ 2) భోపాల్ 3) గాంధీనగర్ 4) పైవన్నీ
కర్కటక రేఖకు సమీపంలోని ‘పలమావు టైగర్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది? 1) గుజరాత్ 2) రాంచీ 3) మిజోరం 4) మధ్యప్రదేశ్
కింది వాటిలో సరైనవి ఎ: గ్రీనిచ్ ప్రామాణిక కాలం, భారత్ ప్రామాణిక కాలాల మధ్య కాలం 5:30 నిమిషాల వ్యత్యాసం ఉంది ఆర్: భారత్ ఉనికి రీత్యా పూర్వార్ధ గోళంలో విస్తరించి ఉండి, భారత ప్రామాణిక రేఖాంశం 82 1/2 డిగ్రీల (82-30||) తూర్పు రేఖాంశంగా నిర్ణయించారు 1) ఎ సరైనది 2) ఆర్ సరైనది 3) ఎ, ఆర్ సరైనవి 4) ఎ సరైనది, ఆర్ కాదు
ప్రతిపాదన (ఎ): 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రకారం భారత ప్రామాణిక సమయాన్ని ఉత్తర ప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని వింధ్యాచల్ రైల్వే స్టేషన్లో ఉన్న క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించారు బి: 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం (భారత ప్రామాణిక రేఖాంశం), 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం (కర్కటక రేఖ) రెండు రేఖలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ‘బైకుంఠాపూర్’ వద్ద ఖండించుకొంటాయి 1) ఎ, బి లు వాస్తవం 2) ఎ వాస్తవం, బి తప్పు 3) బి తప్పు 4) ఎ మాత్రమే తప్పు
కింది వాటిలో సరికాని అంశాన్నిసూచించండి? 1) 2019, ఆగస్టు 5న కేంద్రప్రభుత్వం 370వ ఆర్టికల్ రద్దు చేసి జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను తొలగిస్తూ, జమ్ముకశ్మీర్, లద్దాక్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది 2) జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం-2019, ఆగస్టు 9న రాష్ట్రపతితో ఆమోదం పొంది, 2019, అక్టోబర్ 31 నుంచి ఉనికిలోనికి వచ్చింది 3) 2019, నవంబర్ 2న జమ్ముకశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన నూతన మ్యాపులను సర్వే జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది 4) ప్రస్తుతం జమ్ముకశ్మీర్లోని జిల్లాల సంఖ్య 20, లద్దాక్ లోని జిల్లాల సంఖ్య 2
కింది వాటిలో లద్దాక్కు సంబంధించి సరికాని అంశం? ఎ. 2019, అక్టోబర్ 31న కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది, శాసన సభ కలిగిలేని ఒక ప్రధాన కేంద్ర పాలిత ప్రాంతం బి. పాకిస్థాన్, అప్గానిస్థాన్, చైనా దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంది సి. ఆక్సాయ్చిన్, సియాచిన్ ప్రాంతం, గాల్వాన్ లోయ వంటి ప్రధాన ప్రాంతాలు లద్దాక్లో ఉన్నాయి డి. 2 జిల్లాలు (కార్గిల్, లేహ్) కలిగి ఉండి, కారకోరం, జస్కర్, నంగ ప్రభాత్, కే2 శిఖరం లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నాయి 1) ఎ, బి, సి, డి లు సరైనవి 2) ఎ, బి లు సరికానివి 3) బి, సి లు సరికానివి 4) ఏదీకాదు
కింది వాటిలో సరిగా సూచించని ప్రతిపాదన? ఎ. దేశంలోని 16 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, పొరుగున ఉన్న 7 దేశాలతో 15,106.7 కి.మీ. పొడవున అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది బి. విస్తీర్ణం పరంగా ప్రస్తుతం దేశంలో తెలంగాణ 11వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉన్నాయి సి. భారత దేశపు మొత్తం భూ భాగంలో దీవులతో కలుపుకొని దక్షిణ చివరి ప్రాంతం ఇందిరా పాయింట్/పార్సన్ పాయింట్ డి. దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద ఆదివాసీ జిల్లా థానె 1) ఎ, బి, సి 2) డి 3) బి, సి 4) ఎ, డి
కింది వాటిని జతపర్చండి?
దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఎ. కచ్ (గుజరాత్)
జనాభా పరంగా అతిపెద్ద జిల్లా బి. థానె (మహారాష్ట్ర)
విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా సి. దిబంగ్ లోయ (అరుణాచల్ప్రదేశ్)
జనాభా పరంగా చిన్న జిల్లా డి. మాహె (కేరళ, పుదుచ్చేరి)
కింది అంశాల్లో సరిగా సూచించనిది? 1) భారత్కు దగ్గరగా ఉన్న మధ్య ఆసియా రిపబ్లిక్ దేశం తజకిస్థాన్ 2) దేశంలో అతి తక్కువ సరిహద్దు కలిగి ఉన్న పొరుగు దేశం అఫ్గానిస్థాన్ 3) చైనాతో దేశంలోని 4 రాష్ర్టాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం భూ సరిహద్దు కలిగి ఉన్నాయి 4) చైనా, నేపాల్తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్
దేశంలో 3 పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న రాష్ర్టాలు? 1) సిక్కిం 2) పశ్చిమబెంగాల్ 3) అరుణాచల్ప్రదేశ్ 4) పైవన్నీ
కింది ప్రతిపాదనల్లో వాస్తవమైనవి? ఎ. అసోం బంగ్లాదేశ్, భూటాన్లతో సరిహద్దు కలిగి ఉంది బి. అత్యధిక పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగిన రాష్ట్రం పశ్చిమబెంగాల్ సి. మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్ డి. దేశంలో ఒక రాష్ట్రంతో మాత్రమే సరిహద్దును కలిగి ఉన్న రాజకీయ విభాగాలు అయినవి- సిక్కిం, మేఘాలయ 1) ఎ, సి, డి 2) సి, డి 3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
కింది వాటిలో సరికాని అంశం? ఎ. దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 8 రాష్ర్టాలతో, 1 కేంద్ర పాలిత ప్రాంతంతో భూ సరిహద్దును కలిగి ఉంది బి. దేశంలో తక్కువ పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగిన రాష్ట్రం- హిమాచల్ ప్రదేశ్ (200 కి.మీ) సి. పాకిస్థాన్తో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం రాజస్థాన్ కాగా, అతి తక్కువ భూ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం పజాబ్ 1) ఎ, సి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు
కింది వాటిలో సరైన వాటిని సూచించండి? ఎ. సిమ్లా ఒప్పందం భారత్, పాకిస్థాన్ల మధ్య 1972, జూలై 2న జరిగింది బి. 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం ‘ఆజాద్ కశ్మీర్, కశ్మీర్ మధ్యగల సరిహద్దుగా ఉండే ‘సీజ్ ఫైర్ లైన్’ను ‘లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ)’గా మార్చారు సి. 1947, అక్టోబర్ 26న మహరాజా హరిసింగ్ కశ్మీర్ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేశారు డి. ఎల్వోసీ అనే సరిహద్దు రేఖ జమ్ముకశ్మీర్లోని సంగం అనే ప్రాంతం నుంచి ‘సియాచిన్’ హిమానీ నదం పరిధి వరకు ఉంది. పొడవు 778 కి.మీ. 1) ఎ, సి, డి 2) బి, సి, డి 3) ఎ, బి, సి, డి 4) బి, సి
కింది వాటిలో ‘సర్క్రిక్’కు సంబంధించి సరైన ప్రతిపాదన? ఎ. సర్క్రిక్ ప్రాంతం భారత్కు పశ్చిమాన గల రాణ్ ఆఫ్ కచ్ (గుజరాత్) ప్రాంతాన్ని, పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సును వేరుచేసే సరిహద్దు బి. సర్క్రిక్ స్థానిక నామం బాన్గంగా, క్రిక్ అంటే ఒక చీలిక భూ భాగం 1) ఎ 2) ఎ, బి 3) బి 4) ఏదీకాదు