న్యాయవిద్య… పురాతనమైనది. ఇటీవల కాలంలో మరింత క్రేజీతో ఎక్కువమంది ఎంపికచేసుకుంటున్న రంగం. సాంకేతికత పెరుగుతున్నకొద్ది పలు అంశాల్లో అనేక సమస్యలు. దీనికోసం కొత్త చట్టాలు, వాటి అమలు, వివాదాలు, ఇలా అనేక సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థది ప్రముఖపాత్ర. అదేవిధంగా బలహీనులను బలవంతులు దోచుకోకుండా కాపాడే వ్యవస్థల్లో న్యాయస్థానాలు కీలకం. ఇటీవల కాలంలో జిల్లాస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు న్యాయస్థానాల పాత్ర పెరుగుతున్నది. లా కోర్సులు చేసిన ప్రతిభావంతులకు కార్పొరేట్ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. లా కోర్సులకు పలు పేరొందిన కాలేజీలు ఉన్నాయి. వాటిలో ప్రతిష్ఠాత్మకమైనది ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ. ఇక్కడ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏఐఎల్ఈటీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..
దేశంలో ప్రతిష్ఠాత్మక న్యాయవిద్యా కళాశాలల్లో ఇది ఒకటి. నేషనల్ లా యూనివర్సిటీని ఢిల్లీలో 2008లో ప్రారంభమైంది. 2010లో ఎన్ఎల్యూ పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్థలో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తారు. ఈ సంస్థలో ప్రవేశాల కోసం క్లాట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకోరు.