ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రోడ్డుపై వెళ్తుండగా అతని బైక్ అదుపుతప్పింది. దాంతో కింద పడిపోయాడు. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న వాహనాలు అతన్ని తొక్కేశాయి. ఈ ఘటన ఢిల్లీలోని తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. నరేంద్ర అనే 32 ఏళ్ల వ్యక్తి జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు.
బదార్పూర్ ఫ్లైఓవర్పై వెళ్తుండగా.. గాలిపటాలకు ఉపయోగించే మాంజా దారం అతని బైక్ వెనుక టైరు, ఫుట్రెస్టును చుట్టేసింది. దీంతో తడబడిన నరేంద్ర కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఒక భారీ వాహనం అతన్ని తొక్కేసింది. ఈ కారణంగానే నరేంద్ర మరణించినట్లు పోలీసులు తెలిపారు. నరేంద్ర శరీరంపై మాంజా దారం ఎక్కడా కనిపించలేదని, ఇంకా ఈ కేసులో ఎవరినీ అరెస్టు చెయ్యలేదని వెల్లడించారు.