రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఇండియా లెజెండ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ కరోనా బారినపడ్డాడు. తనకు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని పఠాన్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఇవాళ ఉదయం దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తనకు కరోనా సోకిందని వెల్లడించిన విషయం తెలిసిందే. సచిన్ కూడా ఇటీవల ముగిసిన వరల్డ్ సిరీస్లో పాల్గొన్నాడు.
తేలికపాటి లక్షణాలతో ఇవాళ నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మా ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను. అవసరమైన అన్ని జాగ్రత్తలు, మందులను తీసుకున్నాను. గత కొద్దిరోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వారు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని పఠాన్ అభ్యర్థించాడు.