కర్నూలు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు రెండు టైర్లు ఒకేసారి పేలడంతో అదుపుతప్పిన కారును డ్రైవర్ అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం నుంచి విజయమ్మ బయటపడినట్లుగా తెలుస్తున్నది.
వైఎస్ రాజశేఖర్రెడ్డి స్నేహితుడు అయ్పపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయమ్మ కర్నూలుకు వచ్చారు. అక్కడి నుంచి వెళ్తుండగా గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైరు ఒకేసారి పేలిపోయాయి. దాంతో కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడి నుంచి విజయమ్మ మరో కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు.
రెండు, మూడు నెలల క్రితం టీడీపీ నేత విష్ణువర్ధన్రెడ్డి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండు పేలడంతో ఆలంపూర్ చౌరస్తాలో ప్రమాదానికి గురవడంతో ఆయన దుర్మరణం పాలయ్యారు.