యువతకు సీడీఎస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపు
సీడీఎస్తో అనురాగ్ వర్సిటీ అవగాహనా ఒప్పందం
హైదరాబాద్ సిటీబ్యూరో/ఘట్కేసర్ రూరల్, మార్చి 29 : సామాజిక సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని సెంటర్ ఫర్ దళిత్ స్టీడీస్ (సీడీఎస్) చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపు ఇచ్చారు. ‘సమాజంలో వృత్తి నిపుణుల పాత్ర’ అనే అంశంపై మంగళవారం అనురాగ్ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి ఆవశ్యకత గురించి వివరించారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం ద్వారా అద్భుతాలను సృష్టించవచ్చని సీనియర్ జర్నలిస్టు కే రామచంద్రమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో అనురాగ్ సీఈవో నీలిమ, ఉపకులపతి ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ డాక్టర్ సైదా సమీన్ ఫాతిమా, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ ఉట్ల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పరిశోధన, శిక్షణ, పాలసీమేకర్లతో నెట్వర్కింగ్, కన్సల్టెన్సీ సేవలను అందించడం తదితర అంశాలపై సీడీఎస్, అనురాగ్ వర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ (ఈడీసీ) అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి.