చెన్నై : మార్ఫింగ్ ఫోటోతో మహిళను బెదిరిస్తున్న 22 ఏండ్ల యువకుడిని తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో తిరువరక్కాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్లూరు జిల్లా కరసమంగళం గ్రామానికి చెందిన నిందితుడు ఎన్ సంతోష్ బాధిత మహిళ ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో క్లాస్మేట్స్. కొద్దిరోజుల కిందట మహిళకు తన వాట్సాప్ మెసెంజర్లో మార్ఫింగ్ చేసిన తన ఫోటోను నిందితుడు పంపాడు.
ఆమె నగ్న చిత్రాలను పంపాలని నిందితుడు బెదిరించడంతో సదరు నెంబర్ను ఆమె వెంటనే బ్లాక్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఆమె గురించి నిందితుడు తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.