కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని యువత టీఆర్ఎస్ బాటపడుతున్నారు. సంక్షేమ సర్కారు వెంటే ఉంటామని నినదిస్తున్నారు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడారు. బీజేపీ చేస్తున్న కుట్రలను యువత తిప్పికొట్టాలని సూచించారు. అసత్య ప్రచారాలు.. అబద్ధాలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో చేరినవారిలో బండి అఖిల్, బండి శ్రీనివాస్, కుమ్మరి కృష్ణబాబు, కుమ్మరి కృష్ణ, రామంచ రాజు, కుమ్మరి అఖిల్, రాజేశ్, హరీశ్, తెప్ప రజినీకాంత్, కుమ్మరి జగన్, నగరబోయిన నవీన, కుమ్మరి శ్రీకాంత్, గణేశ్ ఉన్నారు.