అమరావతి : వైఎస్ఆర్ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లిలో ల్యాప్టాప్ పేలి యువతికి గాయాలయ్యాయి. వర్క్ ఫ్రం హోం నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుమతి అనే యువతి ఇంటి గది లోపల నుంచి లాక్ పెట్టుకుని ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి విధులు నిర్వహిస్తుంది. కొంతసేపటికే ఆ ల్యాప్టాప్ పేలిపోవడంతో మంటలు చెలరేగి గది మొత్తం వ్యాపించింది.
గది నుంచి పొగలు రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించి గాయపడ్డ ఆమెను హుటాహుటిన చికిత్స కోసం కడపలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్కి తీసుకెళ్లాలని సూచించారు.