అమరావతి : వ్యసనంగా మారే ఆటలు యువకుల ప్రాణాలమీదకు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో సెల్ఫోన్ల అతి వినియోగానికి కృష్ణా జిల్లాలోని మచిలిపట్నంలో ప్రభు అనే యువకుడు పబ్జీగేమ్లో ఓడిపోయానన్న బాధతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో ప్రభు తన స్నేహితులతో కలసి నిన్న పబ్జీ గేమ్ ఆడాడు. అయితే ఈ గేమ్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోని తన గదికి వెళ్లి రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పబ్జీగేమ్లో ఓడిపోయినందుకే ఉరివేసుకుంటున్నట్లు అక్కడ సుసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.