హైదరాబాద్ : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు యువకుడు బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం అంబర్పేట శివం రోడ్డులో చోటు చేసుకున్నది. మృతుడిని పటేల్నగర్ వాసి బండ్ల భానుప్రసాద్ (18)గా గుర్తించారు. భాను ప్రసాద్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రాల కిందపడిపోయాడు. అతనిపై నుంచి టైర్లు వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.