అహ్మదాబాద్ : ఒకటి రెండు రోజులపాటు మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా? అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది. తోటి సమాజం కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించలేదని, పండగలు ఉన్నందున కేవలం కబేళాను తాత్కాలికంగా మూసివేశారని హైకోర్టు అభిప్రాయపడింది.
కుల్హింద్ జమియాత్ అల్ ఖురేష్ యాక్షన్ కమిటీ ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్పై గుజరాత్ హైకోర్టు విచారించింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల ఆహార హక్కును నిరోధించడమే అని పిటిషన్దారు డాక్టర్ ఖురేషీ రజావాలా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
పిటిషన్ను విచారించిన జస్టిస్ సందీప్ భట్.. ‘ఒకటి రెండు రోజుల పాటు మాంసం తినకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవచ్చు..’ అని సూచించారు. తమను తాము నిగ్రహించుకోవడం గురించి కాదని, ప్రాథమిక హక్కులకు సంబంధించినది అని పిటిషనర్ వాదించారు. కబేళాను పూర్తిగా మూసివేయలేదని, ఓ నాలుగు రోజులు మాంసం విక్రయాలపై తాత్కాళికంగా నిషేధం విధించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోర్టుకు విన్నవించింది. పండుగల దృష్ట్యా ఈ నెల 24, 31 తేదీలతో పాటు వచ్చే నెల 4, 9 తేదీల్లో నగరంలో ఉన్న ఏకైక కబేళాను మూసిఉంచాలని అధికారులను కోర్టు ఆదేశించింది.