కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుగ్లీలో గురువారం ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యాంటీ రోమియో స్క్వాడ్స్ను నియమించిన మరుక్షణమే తృణమూల్ కాంగ్రెస్ ఆకతాయిలను జైలుకు పంపుతారని అన్నారు.
మహిళల ప్రయోజనాలను కాపాడేలా యూపీ తరహాలో బెంగాల్లోనూ యాంటీ రోమియో స్క్వాడ్స్ను బీజేపీ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. మే 2 తర్వాత దీదీ జై శ్రీరాం అని నినదించడం మొదలుపెడతారని యోగి వ్యాఖ్యానించారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు హింసను ప్రేరేపించేలా వ్యవహరించారని ఆరోపించారు. ఇక అంతకుముందు జరిగిన మరో ర్యాలీలో యోగి మాట్లాడుతూ జై శ్రీరాం నినాదాలు వింటే దీదీ అసౌకర్యంగా ఫీలవుతున్నారని యోగి వ్యాఖ్యానించారు