అమరావతి : ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.
ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు.
ఈ విషయంలో కోర్టును ఒప్పించి వాస్తవాలు చెబుతామని, సమస్యలు అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
32 పురపాలికలు, 3 నగరపాలికలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
విలీన గ్రామాలను కలిసి రాజమహేంద్రవరం ( రాజమండ్రి) నగరపాలికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమండ్రిని ఆదర్శ నగరంగా తీర్చుదిద్దుతామని అన్నారు.