అమరావతి : తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ విజయ్కుమార్పై వైసీపీ శ్రేణులు దాడు చేయడాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. రెండురోజుల క్రితం కౌన్సిలర్ మల్లికార్జునపైనా దాడి చేశారని మండిపడ్డారు. ఎస్సీలపై వైఎస్సార్ దాడులు జగన్ కానుక పథకం అమలవుతోందని తెలిపారు.
తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోతోందని అన్నారు. జగన్ను మించిన నియంతలా పెద్దారెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.