యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకవైపు ఆధ్యాత్మిక పరిమ ళం.. మరోవైపు ఆహ్లాదం పంచే ఆకుపచ్చని వైభ వం.. ప్రపంచలోనే అద్భుత దృశ్యకావ్యం యాదాద్రిలో ఆవిష్కృతమవుతున్నది. స్వామివారి ప్రధానాలయ పునర్నిర్మాణం పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భక్తులకు వసతుల కల్పనపై యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) దృష్టి సారించింది. వసతులకు సంబంధించి పలు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీల కోసం రెండు లిప్టులను సిద్ధంచేశారు. అతిథి గృహం నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకునేలా వీటిని ఏర్పాటుచేశారు. 20 ఫీట్ల వెడల్పు, 20.5 ఫీట్ల పొడవుతో నిర్మిస్తున్న లిప్టు రూం పనులు పూర్తయ్యాయి. ఒక్కొ క్క లిఫ్టులో ఒకేసారి 12 మంది వెళ్లొచ్చు.
రెండు అంతస్తుల్లో అతిథి గృహం
ప్రధానాలయం పడమర వైపు కింది భాగంలో రూ.2.85 కోట్లతో 20 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పుతో నిర్మించిన కార్యనిర్వహక అధికారి(ఈవో) కార్యాలయ భవనం ఇప్పటికే వినియోగంలోకి వచ్చింది. దీనిపక్కనే రూ.3 కోట్లతో 20 మీ టర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవుతో అతిథి గృహాన్ని నిర్మించారు. ఈ భవనం మొదటి ఫ్లోర్లో రెండు సమావేశ మందిరాలు, ప్రత్యేక గది.. రెండో ఫ్లోర్లో మూడు ప్రత్యేక గదులు, ఒక పెద్దహాల్ నిర్మించారు.
పూర్తికావొచ్చిన ప్రెసిడెన్షియల్ సూట్లు
స్వామి దర్శనం కోసం వచ్చే రాష్ట్రపతి, ప్రధా ని వంటి ముఖ్యులు బసచేసేందుకు ప్రధానాలయానికి ఉత్తరాన 13 ఎకరాల గుట్టపై రూ.104 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. ఇతర వీఐపీల బసకు నిర్మిస్తున్న 14 విల్లాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
సిద్ధమవుతున్న ఔటర్ రింగ్రోడ్డు
ప్రధానాలయం కొండ చుట్టూ రూ.120 కోట్లతో 5.7 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్రోడ్డు సిద్ధమవుతున్నది. రాయగిరి-యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట-రాజాపేట, యాదగిరిగుట్ట-కొమురవెల్లి, యాదగిరిగుట్ట-తుర్కపల్లి మీదుగా కీసర వరకు రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.